ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, 03, 07 తేదీల్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉండడం, దేశ రాజకీయాలపై ప్రభావితం దృష్ట్యా ప్రస్తుతం అందరి దృష్టి యూపీ ఎన్నికలపై ఉంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం విస్తృత ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు 125 మంది అభ్యర్థులతో కూడిన తోలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 50 మంది మహిళలు చోటు దక్కించుకున్నారు. కాగా ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి పార్టీ టికెట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, ఉన్నావ్ అభ్యర్థి ఆశా సింగ్ ఒక అత్యాచార బాధితురాలి తల్లి. ఆమె ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. మేము ఆమెకు అవకాశం ఇచ్చామని చెప్పారు. ఆలాగే ఆశా వర్కర్స్ కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను పట్టించుకోకుండా దేశానికి సేవ చేశారని, వారి గౌరవవేతనం కోసం ఆందోళన చేపట్టి నాయకత్వం వహించిన ఆశా వర్కర్ పూనమ్ పాండే కు షాజహాన్పూర్ టికెట్ కేటాయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన తొలిజాబితాలో 40 శాతం మహిళలకు, 40 శాతం యువతకు టికెట్స్ కేటాయించినట్టు చెప్పారు.
उत्तर प्रदेश में कांग्रेस प्रत्याशियों की पहली सूची में 40% महिलाएं और 40% युवा। पार्टी ने कई पीड़ित और संघर्षशील महिलाओं को चुनाव लड़ने का मौका दिया है। #आ_रही_है_कांग्रेस pic.twitter.com/V6pTXP5315
— UP Congress (@INCUttarPradesh) January 13, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ