ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 38,069 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరులో 122, నెల్లూరులో 100, తూర్పుగోదావరిలో 88, గుంటూరులో 78, ప్రకాశంలో 76, కడపలో 61 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,47,459 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 6 మరణాలు చోటుచేసుకున్నాయి. కృష్ణాలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, కడపలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14142 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,178 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,20,835 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,482 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ