ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టుహౌస్)లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 26, బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో గ్రామ న్యాయాలయానికి జూనియర్ సివిల్ జడ్జి లేదా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్ క్యాడర్) అధికారి గ్రామ న్యాయాధికారిగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ఒక సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ను ప్రతి గ్రామ న్యాయాలయానికి నియమించనున్నారు. ఒక్కో గ్రామ న్యాయాలయానికి జీతాలు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.27.60 లక్షలు, ఫర్నిచర్ కొనుగోలు, లైబ్రరీ ఏర్పాటు కోసం రూ.2.10 కోట్లు కేటాయించనున్నారు. గ్రామ న్యాయాలయాల చట్టం–2008 కింద వీటిని ఏర్పాటు చేస్తునట్టు పేర్కొంటూ, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 జిల్లాల్లో విలేజ్ కోర్టుల ఏర్పాటు వివరాలు:
- గుంటూరు జిల్లా: 12
- ప్రకాశం జిల్లా: 8
- కర్నూలు జిల్లా: 3
- శ్రీకాకుళం జిల్లా: 3
- నెల్లూరు జిల్లా: 3
- అనంతపురం జిల్లా: 2
- వైఎస్సార్ కడప జిల్లా: 2
- కృష్ణా జిల్లా: 2
- పశ్చిమ గోదావరి: 2
- విశాఖపట్నం జిల్లా: 2
- చిత్తూరు: 1
- తూర్పు గోదావరి: 1
- విజయనగరం జిల్లా: 1
[subscribe]