ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పాలిసెట్-2022) ను రేపు (మే 29, ఆదివారం) నిర్వహించనున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2022 నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 404 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాలిసెట్-2022 ప్రవేశ పరీక్ష జరుగనుందని, విద్యార్థులను ఉదయం పది గంటల నుంచే పరీక్షా కేంద్రాలోకి అనుమతిస్తామని చెప్పారు. పాలిసెట్ కోసం మొత్తం 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
ఈ పాలిసెట్ పరీక్ష 120 మార్కులకి జరుగుతుండగా, ఫలితాలను పరీక్ష జరిగిన నాటి నుంచి పది రోజుల్లో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు https://polycetap.nic.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కాగా ఏపీలో మొత్తం 70 వేలపైగానే పాలిటెక్నిక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF