ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్

AP Assembly Budget Session Speaker Tammineni Sitaram Suspends TDP Members Including MLA Kotamreddy Sridhar Reddy,AP Assembly Budget Session,Speaker Tammineni Sitaram,Sitaram Suspends TDP Members,Speaker Sitaram Suspends Kotamreddy,MLA Kotamreddy Sridhar Reddy,Mango News,Mango News Telugu,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Latest Updates,AP Assembly 2023 Live Updates,AP Assembly 2023 Latest News,AP Assembly Latest News,AP CM YS Jagan Mohan Reddy,AP Assembly Budget Session,AP Assembly 2023 State Budget,AP Assembly Budget News,AP Assembly Latest Budget Updates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరితో పాటుగా అధికార పార్టీ అసంతృప్త ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా శాసనసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై సభలో నిల్చుని ప్లకార్డు ప్రదర్శించడంపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కోటంరెడ్డి వినకపోవడంతో ఆయనను కూడా సస్పెండ్ చేశారు. కాగా గవర్నర్ రిసీవింగ్ అంశంపై సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆయన దీనిపై సభలో దాదాపు సుమారు 40 నిమిషాలకు పైగా అధికార పార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో అడ్డుతగిలారు.

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. గవర్నర్‌ను అవమానిస్తే సహించేది లేదని, దీనిని సీరియస్ ఇష్యూగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రివిలేజ్ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామని, సభను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా అంతకుముందు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు అవమానం జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. పత్రికల్లో వచ్చిన కథనాలను సభలో చదివి వినిపించిన ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మంగళవారం సభలో జరిగిన పరిణామాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు. ఇక గవర్నర్‌ను సీఎం జగన్ ఎక్కడా అవమానించలేదని, గవర్నర్‌ వేచి ఉండేలా చేశారని అవాస్తవాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ ఉద్దేశపూర్వకంగానే శాసనసభను ఉద్దేశించి తప్పుడు ఆరోపణలు చేస్తే, వాటిని యథాతథంగా ప్రచురించారని తెలిపారు. స్పీకర్ అమోదంతో పయ్యావుల కేశవ్‌తో పాటు ఈ అసత్య వార్తల్ని ప్రచురించిన సంస్థపై సభాహక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 8 =