తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ముందుగా లాక్డౌన్ సమయంలో కేవలం జాతీయ రహదారులపై ఉండే పెట్రోల్, డీజిల్ పంపులు మాత్రమే నిరంతరం తెరిచే ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పెట్రోల్ బ్యాంకులకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే అనుమతి ఇచ్చారు. అయితే రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ జరుగుతుండడంతో కొనుగోళ్ల కేంద్రాల నుంచి రైస్ మిల్లుల వద్దకు వాహనాల్లో ధాన్యాన్ని తరలించవలసి ఉండడం, వ్యవసాయ అవసరాలు, ఎమర్జెన్సీ సేవల వాహనాల అవసరం దృష్ట్యా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఇకపై సాధారణ సమయాల్లో(పని గంటల్లో) పెట్రోల్ బ్యాంకులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ