ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ మొదటివారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సమావేశాలు నిర్వహించే తేదీలను రెండురోజుల్లోగా ఖరారు చేసే అవకాశమున్నట్టు సమాచారం. గత జూన్ లో ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను నిర్వహించి బడ్జెట్ తో పాటు సంక్షేమ పథకాలు, విధాన నిర్ణయాలకు సంబంధించిన పలు బిల్లులను ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఆరు నెలల లోపల రాష్ట్ర శాసనసభను సమావేశపరచవలసి ఉండడంతో డిసెంబర్ లో శీతాకాల సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇసుక విధానంతో పాటు, ఇటీవల రెండు సార్లు జరిగిన మంత్రివర్గ సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
[subscribe]
Malladi Vishnu Reveals About CM YS Jagan Rudrabhishekam in Vijayawada | AP Politics | Mango News
03:55
Minister Adimulapu Suresh Comments On Narayana & Chaitanya Colleges Over Their Teachings | MangoNews
09:32
Mekathoti Sucharita Reveals Unknown Details Over AgriGold Assets | AP Latest News | Mango News
05:42
TDP Leader Kuna Ravi Kumar Slams YCP Govt In Press Meet | AP Political News | Mango News
08:41