జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోమవారం సాయంత్రం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో జరిగిన ఘటనలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ముందుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “విశాఖలో జనసేన నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టారు. గతంలో విజయనగరంలో బీజేపీ కార్యకర్తని కత్తులతో పొట్ట కోసేస్తే పేగులు బయటికి వచ్చేసిన పరిస్థితి. కడపలోనూ వారి నాయకుల మీద దాడి చేశారు. ఈ విషయాల మీద చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులు శృతిమించడంతో మద్దతు తెలిపేందుకు సోము వీర్రాజు స్వయంగా వచ్చారు” అని పవన్ కళ్యాణ్ తెలిపారు. వారితో పాటు విశాఖలో పరిణామాల మీద ఎప్పటికప్పుు వాకబు చేసిన బీజేపీ నేత పురందేశ్వరికి, సునిల్ దేవధర్ కి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, ఎమ్మెల్సీ మాధవ్ కి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దమనకాండను జనసేన, బీజేపీ కలసి ఎదుర్కొంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ పట్ల పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తీరు, వారినినెడుతూ మాట్లాడడం వంటివి ప్రజాస్వామ్యంలో తీవ్ర ఆందోళన కలిగించే అంశాలన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ దమనకాండను కేంద్ర పెద్దల వద్ద ప్రస్థావించామని సోము వీర్రాజు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY