పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ: తిరుపతి అభ్యర్థి, రాజకీయ పరిస్థితులపై చర్చ

Andhra Pradesh, AP BJP President, AP BJP President Somu Veerraju, AP BJP President Somu Veerraju Meets Pawan Kalyan, AP News, AP Political Updates, AP Politics, bjp, BJP Latest News, Janasena, janasena chief pawan kalyan, latest news, Pawan Kalyan Latest News, pawan kalyan news, Political Updates, Somu Veerraju, Somu Veerraju Meets Pawan Kalyan, telugu news, Tirupati By Election News, Tirupati MP Candidate

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన-బీజేపీ ఉభయ పార్టీల అభ్యర్థి విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన ప్రణాళికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించారు. ఆదివారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను సోము వీర్రాజు కలసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

“తిరుపతి ఉపఎన్నిక, ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చాయి. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల అభ్యర్ధిగానే భావించి విజయానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తూ, ఇందుకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక విజయంతో నాంది పలికే విధంగా ఇరుపార్టీల శ్రేణులను సమాయత్తం చేస్తారు. ఎక్కడైనా చిన్న పాటి గ్యాప్స్ ఉన్నా ఎప్పటికప్పుడు చర్చల ద్వారా వాటిని చక్కదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వారా సమన్వయ లోపం లేకుండా ఇరుపార్టీలు ముందుకు వెళ్లేలా కార్యక్రమాల్ని సిద్ధం చేస్తారు. అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు” అని జనసేన పార్టీ పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =