ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 26, శుక్రవారం నాడు మూడునెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఆమోదం కోసం ఈ బడ్జెట్ ఆర్డినెన్స్ ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపనుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల కారణంగా 2021-2022 బడ్జెట్ కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు. ఈ క్రమంలో మార్చి 31తో 2020-21 ఆర్ధిక సంవత్సరం ముగియనుండంతో ప్రభుత్వం ఈ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. మూడునెలలపాటుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, నవరత్నలు పథకాల అమలు కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. ఏప్రిల్ చివరిలో లేదా మే మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిపి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. అయితే తదుపరి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ