ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం, హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, ఇతర రాయలసీమ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్, గిరిజన ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు, రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, జీఎస్టీ అంశంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై కూడా కీలకంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu