ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవ’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రం లోని అందరి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి యుగంలో ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని.. సాధికారతకు ప్రతినిధులుగా ప్రస్తుత మహిళలు నిలుస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను రాజకీయంగా కూడా ప్రోత్సహించాలని భావించామని, అందుకే వారికి 51 శాతం పదవులు కేటాయించాలని చట్టం చేశామని, జడ్పీ ఛైర్ పర్సన్లుగా 54శాతం మంది మహిళలే ఉన్నారని సీఎం జగన్ తెలిపారు.
ఏపీలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వలన ఏపీ మహిళలకు గౌరవంతో పాటు భరోసా కూడా దక్కిందని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 15 వేలమందికి పైగా మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎంపీలు సత్యవతి, వంగా గీత, మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు రోజా, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ