ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనంజయ్ రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్, సీఎం సీపీఆర్ఓ శ్రీపూడి శ్రీహరి తదితరులు హాజరై సీఎం వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ