ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 3, సోమవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 10:50 గంటల నుండి గన్నవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ చర్చించే అవకాశమునట్టు సమాచారం. ముఖ్యంగా పోలవరం, మూడు రాజధానులు సహా అమరావతి అంశం, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, పలు ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, విభజన చట్టం హామీల అమలు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో కూడా సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యే అవకాశమునట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ