ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని, సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశానికి మంత్రులు సమీక్షా సమావేశంలో ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూడి ముత్యాల నాయడు, సీఎస్ సమీర్ శర్మ, సీఎం సలహాదారు అజేయ కల్లాం, ఇంకా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భమాగ్ సీఎం జగన్ మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఈ విధానం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సమగ్ర సర్వేను నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. దీనికోసం అవసరమైన సిబ్బందిని, సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని చెప్పారు. డ్రోన్లు, ఓఆర్ఐ పరికరాలు, రోవర్లు, సర్వే రాళ్లు మొదలైనవి ముందుగానే సిద్ధం చేసుకోవాలని అన్నారు. 100 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోందని, కావున ఈ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని అధికారులను హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF