దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం తేవడానికి, అలాగే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి తేవడానికై ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ బుధవారం తమిళనాడు లోని కన్యాకుమారిలో ప్రారంభం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ దీనిని నేడు ప్రారంభించనున్నారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రను ఆయన ముందుండి నడిపించనున్నారు. ఈ క్రమంలో 150 రోజుల పాటు జరుగనున్న ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)ల మీదుగా కొనసాగనుంది. కాగా ఈ యాత్ర ఆసాంతం రాహుల్ వెంట 119 మంది సీనియర్ నేతలు అడుగులు కలపనున్నారు. ఈ నేపథ్యంలో.. రాహుల్ గాంధీ నిన్న రాత్రే ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. బుధవారం ఉదయం శ్రీపెరుంబుదూరులోని ఆయన తండ్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ స్మారక స్థలానికి చేరుకుని నివాళులర్పించారు.
I lost my father to the politics of hate and division. I will not lose my beloved country to it too.
Love will conquer hate. Hope will defeat fear. Together, we will overcome. pic.twitter.com/ODTmwirBHR
— Rahul Gandhi (@RahulGandhi) September 7, 2022
కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్ర ఇలా కొనసాగనుంది..
- రాహుల్ గాంధీ విమానంలో తిరువనంతపురం చేరుకుని, అక్కడి నుండి హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకుంటారు.
- ముందుగా సాయంత్రం బహిరంగ సభ నిర్వహించి, కాంగ్రెస్ ఈ జోడో యాత్ర చేపట్టడానికి గల కారణాలను వివరించి పాదయాత్రను ప్రారంభిస్తారు.
- నేటి కార్యక్రమానికి మిత్రపక్షం డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గహ్లోత్, భూపేశ్ బఘేల్, ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరవనున్నారు.
- కాగా ప్రతి రోజూ యాత్ర రెండు జట్లుగా సాగనుండగా, ఉదయం 7-10.30 మధ్య ఒక జట్టు, సాయంత్రం 3.30-6.30 మధ్య రెండో జట్టు యాత్రలో పాల్గొంటాయి.
- రాహుల్ వెంట నడిచేవారిని 3 రకాలుగా వర్గీకరించారు. దీని ప్రకారం భారత్ యాత్రీలు, స్థానిక కార్యకర్తలను ప్రదేశ్ యాత్రీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొనే వారిని అతిథి యాత్రీలుగా వ్యవహరించనున్నారు.
- ప్రతి రోజూ దాదాపు 22-23 కి.మీ. వరకు పాదయాత్ర సాగేలా రూట్ మ్యాప్ రూపొందించారు.
- ఈ క్రమంలో ఈ నెల 11న కేరళలో ప్రవేశించే ఈ యాత్ర ఆ రాష్ట్రంలో దాదాపు 18 రోజులపాటు కొనసాగనుంది.
- అనంతరం 30వ తేదీ నాటికి కర్ణాటక చేరుకొని అక్కడ 21 రోజుల పాటు సాగనుంది.
- ఇలా కన్యాకుమారి నుంచి తిరువనంతపురం, కొచ్చి, నీలాంబర్, మైసూరు, బళ్లారి, రాయచూరు, వికారాబాద్, నాందేడ్, జల్గావ్, ఇండోర్, కోట, దౌసా, ఆల్వార్, బులంద్ శహర్, ఢిల్లీ, అంబాలా, పఠాన్కోట్, జమ్మూ మీదుగా కొనసాగి చివరగా శ్రీనగర్ చేరుకుంటుంది.
- కాగా ఈ యాత్రలో పాల్గొనేందుకు దాదాపు 50,000 మంది పేర్లు కూడా నమోదు చేయించుకోవడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ