ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022, మే 11వ తేదీ నుంచి ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలో ప్రతి ఇంటికి జరిగిన మేలును ప్రజల వద్దకే వెళ్లి వివరించి, వారి ఆశీస్సులు కోరేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మే 11 నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పలుమార్లు వర్క్ షాప్ నిర్వహించగా, తాజాగా నేడు (డిసెంబర్ 16, శుక్రవారం) మరోసారి వర్క్షాప్ నిర్వహించనున్నారు.
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరగనున్న గడపగడపకు మన ప్రభుత్వం వర్క్షాప్లో పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొంటారు. ఈ వర్క్ షాప్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుపై సమీక్ష జరిపి, మరింత ప్రభావవంతంగా అన్ని చోట్ల నిర్వహించేలా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE