ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు (మే 12, గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలో సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రులతో గత నెలలో నూతన కేబినెట్ కొలువుతీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కేబినెట్ ఏర్పడిన తర్వాత ఏపీ కేబినెట్ నేడు తొలిసారిగా భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ముందుగానే ఆదేశాలు ఇచ్చారు.
ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మరియు చేపట్టబోయే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. అసని తుఫాన్ నష్టం, అమ్మ ఒడి పథకం, తాజాగా చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, దిశా చట్టంలో సవరణలు, దేవాదాయశాఖలో భూముల ఆక్రమణల అంశం, మూడు రాజధానుల బిల్లు సహా పలు అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF