ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నీలం సాహ్ని డిసెంబర్ 31తో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ గా ఆదిత్యానాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు పదవీకాలం పూర్తయిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని వ్యవరించనున్నారు. అలాగే మరికొందరి అధికారుల బాధ్యతలలోను ఏపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఏపీ పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్యామలరావును జలవనరులశాఖ కార్యదర్శిగా నియమించారు. ఇక పురపాలకశాఖ కార్యదర్శిగా వై.శ్రీలక్ష్మిని, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ