ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 11వ తేదీన కాణిపాకంలో పర్యటించనున్నారు. పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ అక్టోబర్ 11న కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా కాణిపాకంలో శ్రీ వినాయక స్వామివారికి టీటీడీ నూతనంగా తయారు చేసి ఇచ్చిన బంగారు రథాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ