ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) మరింతగా విజృంభిసుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1400 దాటింది. ఏప్రిల్ 30, గురువారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6497 సాంపిల్స్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 71 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా కర్నూల్ జిల్లాలో 43, కృష్ణా జిల్లాలో 10, కడప, గుంటూరు జిల్లాల్లో 4 చొప్పున, చిత్తూరు, అనంతపూర్ జిల్లాలలో 3 చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాలలో 2 కేసుల చొప్పున మొత్తం 71 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1403 పాజిటివ్ కేసులకు గాను 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 61
- చిత్తూరు – 80
- కర్నూల్ – 386
- కడప – 73
- తూర్పుగోదావరి – 42
- పశ్చిమ గోదావరి – 56
- నెల్లూరు -84
- ప్రకాశం – 60
- గుంటూరు – 287
- కృష్ణా – 246
- శ్రీకాకుళం – 5
- విజయనగరం – 0
- విశాఖపట్నం – 23
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో 6497 సాంపిల్స్ ని పరీక్షించగా 71 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1403 పాజిటివ్ కేసు లకు గాను 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051#APFightsCorona pic.twitter.com/2XRWdeqZ2I
— ArogyaAndhra (@ArogyaAndhra) April 30, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu