ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదు

andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని కర్నూల్, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం వంటి నాలుగు జిల్లాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో ఫిబ్రవరి 15, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,899 కు చేరింది. కరోనా నుంచి మరో 69 మంది రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కృష్ణా జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7163 కి పెరిగింది. గత 24 గంటల్లో 18834 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,35,65,062 కు చేరుకుంది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (ఫిబ్రవరి 15, ఉదయం 10 గంటల వరకు) :

  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,88,899
  • కొత్తగా నమోదైన కేసులు : 30
  • కొత్తగా నమోదైన మరణాలు : 1
  • డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,81,041
  • యాక్టీవ్ కేసులు : 695
  • మొత్తం మరణాల సంఖ్య : 7163
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eleven =