గత 11 రోజులగా గోవాలో కొత్తగా కోవిడ్ -19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని, ఇకపై కొత్త కరోనా కేసులు రాకపోతే ఏప్రిల్ 17 నాటికి గోవా గ్రీన్జోన్గా మారే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఏప్రిల్ 14, మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండు జిల్లాల మినహా దక్షిణగోవాను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్జోన్గా ప్రకటించిందని వెల్లడించారు. గోవాలో నమోదైన 7 కరోనా పాజిటివ్ కేసులు కూడా నార్త్గోవాకు చెందిన వ్యక్తులే. వీరిలో 5గురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా, మిగిలిన ఇద్దరికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.
మహరాష్ట్రలోని సింధుదుర్గ్, కర్ణాటకలోని బెళగావి ప్రాంతాలను ఆరెంజ్జోన్లుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులను ఎప్పటికప్పుడు పర్వవేక్షిస్తునట్టు సీఎం ప్రమోద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతకు ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్ 14న కాకుండా ఏప్రిల్ 20వ తేది నుంచి విధులకు హాజరుకావాలని ఆయన ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గోవా ప్రజలంతా మే 3వ తేదీ వరకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]