ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 80,712 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 4,684 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1171, పశ్చిమగోదావరిలో 660, చిత్తూరులో 493, కృష్ణాలో 355, ప్రకాశంలో 307 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,62,036 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 36 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12452 కి పెరిగింది. గత 24 గంటల్లో 7324 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 17,98,380 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ