ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 23, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,62,758 కు, మరణాల సంఖ్య 6948 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 47,130 కరోనా పరీక్షలు నిర్వహించగా 545 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 10 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒకరు, అనంతపూర్ లో ఒకరు, తూర్పుగోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూల్ లో ఒకరు మరియు నెల్లూరులో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6948 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 8,42,416 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లో 1390 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 13394 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ