మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 12, బుధవారం నాడు ఒక్కరోజే కొత్తగా 12712 కరోనా పాజిటివ్ కేసులు, 344 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,313 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 18,650 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 13408 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 3,81,843 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,47,513 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆగస్టు 12 నాటికీ 29,13,686 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu