ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 796 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 27, శనివారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12285 కి చేరింది. 796 కేసుల్లో 740 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 51, విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు ఉన్నారు. గత 24 గంటల్లో 24,458 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. ఈ కేసుల్లో 10093 రాష్ట్రంలో నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మరియు విదేశాల నుండి వచ్చిన వారు 2192 మంది ఉన్నారు.
మరోవైపు కృష్ణాలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, పశ్చిమ గోదావరి లో ఒకరు, తూర్పు గోదావరి లో ఒకరు, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 157 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికి 5480 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 6648 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu