ఏపీలో కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్, 80 కి చేరిన మరణాలు

Andhra Pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP COVID 19 Updates, AP Total Positive Cases, Corona Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India COVID 19 Cases, Total Corona Cases In AP, Total COVID 19 Cases

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 182 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 135 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 38, విదేశాల నుంచి వచ్చిన వారు 9 మంది ఉన్నారు. కొత్తగా నమోదైన 135 కేసులతో కలిపి జూన్ 11, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 4261 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 11602 సాంపిల్స్ ని పరీక్షించగా 135 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే కొవిడ్ వలన తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మరణించగా, ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 80 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2540 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 65 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 1641 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 971 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 564 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 176 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 1168 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 5429 కి చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 11 =