భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు, 357 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 11, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,86,579 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు కొత్తగా నమోదైన 357 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 8,102 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో 1,41,029 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,37,448 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో ఇతర దేశాల్లో రోజువారీగా నమోదవుతున్న కేసులతో పోల్చితే భారత్లోనే ఎక్కువగా నమోదవడం ఆందోళనకరంగా మారింది. మరోవైపు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 5 వ స్థానంలో, కరోనా మరణాల్లో కెనడాను దాటి 11 వ స్థానంలో కొనసాగుతుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 11th June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 286,579
▶️ Active cases: 137,448
▶️ Cured/Discharged/Migrated: 141,029
▶️ Deaths: 8,102#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/cayYB9OUl6
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 11, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu