ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 264 కరోనా పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,831 కు, మరణాల సంఖ్య 14,430 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 247 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,55,226 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,175 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(264):
- తూర్పుగోదావరి – 46
- కృష్ణా – 45
- గుంటూరు – 36
- చిత్తూరు – 30
- పశ్చిమగోదావరి – 20
- నెల్లూరు – 19
- విశాఖపట్నం – 19
- అనంతపూర్ – 13
- శ్రీకాకుళం – 9
- కడప – 8
- ప్రకాశం – 8
- విజయనగరం – 8
- కర్నూల్ – 3
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ