ఏపీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఆర్ఎం భాషా నియామకం

AP Govt Appointed RM Bhasha as AP New Chief Information Commissioner, RM Bhasha, Chief Information Commissioner, RM Bhasha New Chief Information Commissioner, AP New Chief Information Commissioner, New Andhra Pradesh Chief Information Commissioner , RM Basha AP New CIC, CIC, Chief Information Commissioner , Mango News, Mango News Telugu, Chief Information Commissioner Latest News, AP Govt Appointed RM Bhasha As CIC, RM Bhasha Latest News And Live Updates

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)/ప్రధాన సమాచార కమిషనర్‌ గా ఆర్ఎం భాషా నియమితులయ్యారు. ప్రస్తుత సీఐసీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పీ.రమేష్ కుమార్ స్థానంలో ఆర్‌ఎం భాషా బాధ్యతలు చేపట్టనున్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎంపికైన వారు ఆ పదవిలో మూడు సంవత్సరాల పాటు లేదా 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏది ముందుగా వర్తిస్తే అప్పటివరకు కొనసాగనున్నారు.

అలాగే ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్‌/స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పత్తిపాటి శామ్యూల్‌ నియమితులయ్యారు. ముందుగా రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం భేటీ అయింది. ఈ సందర్భంగా ప్రధాన సమాచార కమిషనర్‌ గా ఆర్ఎం భాషాను, సమాచార కమిషనర్ గా పత్తిపాటి శామ్యూల్‌ ను ఎంపిక చేస్తూ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 6 =