ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ)/ప్రధాన సమాచార కమిషనర్ గా ఆర్ఎం భాషా నియమితులయ్యారు. ప్రస్తుత సీఐసీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి పీ.రమేష్ కుమార్ స్థానంలో ఆర్ఎం భాషా బాధ్యతలు చేపట్టనున్నారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎంపికైన వారు ఆ పదవిలో మూడు సంవత్సరాల పాటు లేదా 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏది ముందుగా వర్తిస్తే అప్పటివరకు కొనసాగనున్నారు.
అలాగే ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్/స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పత్తిపాటి శామ్యూల్ నియమితులయ్యారు. ముందుగా రాష్ట్రంలో సమాచార కమిషనర్ల ఎంపికకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం భేటీ అయింది. ఈ సందర్భంగా ప్రధాన సమాచార కమిషనర్ గా ఆర్ఎం భాషాను, సమాచార కమిషనర్ గా పత్తిపాటి శామ్యూల్ ను ఎంపిక చేస్తూ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY