ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మార్చ్ 27, శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సచివాలయంలోని కేబినెట్ హాల్లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేశారు. అలాగే సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
పేర్ని నాని ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం.
- కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేకపోవడం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం.
- కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.
- ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు.
- ప్రతి జిల్లా కేంద్రంలో 200 పడకల ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు.
- కరోనా బాధితుల కోసం విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు
- ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగింపు.
- 52వేల ఎన్-95 మాస్క్లను అందుబాటులో ఉన్నాయి. 400 వెంటిలేటర్లు, 10లక్షల సర్జికల్ మాస్క్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
- డాక్టర్ల కోసం 4వేలకుపైగా ప్రత్యేక బాడీ మాస్క్లను సిద్దం.
- 14రోజుల క్వారంటైన్కు సిద్ధమైతేనే ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు రాష్ట్రంలోకి రావాలి.
- నిబంధనలు ఉల్లంఘించి ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం సృష్టించొద్దు.
- ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రూ.2కోట్ల అత్యవసర నిధి.
- కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఇందులో పది మంది సీనియర్ రాష్ట్ర అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు.
- ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు. జిల్లా మంత్రులు జిల్లా కంట్రోల్ రూమ్లను పర్యవేక్షిస్తారు. ఇక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు.
- విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల సంఖ్యపై రాజకీయాలు చేయడం తగదు.
- మొదటి సర్వే వివరాల ద్వారా 13వేల మంది రాగా, రెండో విడత సర్వేలో 28వేల మంది రాష్ట్రంలోకి వచ్చారని తేలింది.