వైఎస్ఆర్ కడప జిల్లాలోని పాపాఘ్ని నదిపై నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్ కు “వైఎస్ఆర్ వెలిగల్లు రిజర్వాయర్” గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ పేరు మార్పుకు సంబంధించి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జూన్ 26, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 2006 లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తీ చేశారు. దీంతో ఈ రిజర్వాయర్ కు వైఎస్ఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మరోవైపు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎస్పీవీ వందశాతం ప్రభుత్వ నిధులతో పనిచేస్తుందని వెల్లడించారు. జలవనరులశాఖ నుంచి ఎస్పీవీ ఏర్పాటుకు ముందుగా రూ.5 కోట్ల పెట్టుబడి నిధులును ప్రభుత్వం విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu