ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్చ్ 23, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ప్రతి మండలానికి ప్రత్యేకంగా ఒక తెలుగు మీడియం స్కూల్ ను కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా పిల్లలు తెలుగు మీడియంలో చదవాలనుకుంటే వారికీ అనుగుణంగా మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. ఉర్థు, ఒరియా, కన్నడ మరియు తమిళ మీడియం స్కూళ్లను యథాతథంగా కొనసాగించేందుకు అనుమతినిస్తూ, ప్రతి మీడియం స్కూల్ లలో కూడా తెలుగు సబ్జెక్టు ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదేవిధంగా స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Home ఆంధ్ర ప్రదేశ్
- Advertisement -