రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగనన్న గోరుముద్దకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ కింద రాగిజావను చేరింది. మార్చి 2వ తేదీ నుంచి విద్యార్థులకు రాగిజావ అందించనున్నట్టు తెలిపారు. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడంలో భాగంగా జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావను చేరుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్టు భాగస్వామ్యం కానుంది. గురువారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టు ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. కాగా గతంలో మధ్యాహ్న భోజన పథకంగా ఉండగా, సోమవారం నుంచి శనివారం వరకు పౌష్ఠిక ఆహారంతో కూడిన మెనూతో జగనన్న గోరుముద్ద-పీఎం పోషణగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE