వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై, పథకాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలవరం పనుల్లో అవినీతి జరిగిందంటూ, సమీక్ష చేయాలంటూ ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. తాజాగా నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పోలవరం పనులు చేస్తున్న ప్రస్తుత కాంట్రాక్టు కంపెనీలు అయిన నవయుగ కంపెనీ మరియు బెకం కంపెనీలను పనుల నుండి తప్పుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఆదేశించింది. ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందాలను ముందుగానే ముగించే వీలుగా పరస్పర అంగీకార పద్దతిలో, జరిగిన ఒప్పందాలను రద్దుచేసుకోవాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి రెండు నివేదికలు సమర్పించింది. పోలవరం ప్రాజెక్ట్ పనులు, డీపీఆర్ లను పరిశీలించి గతంలో ఆమోదించిన టెండర్లలో అవినీతి జరిగిందని, అంచనాలను అనూహ్యంగా పెంచేసారని కమిటీ తేల్చింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, నామినేషన్ ప్రాతిపదికపై గతంలో పనులు అప్పజెప్పారని, అది సరైన పద్ధతి కాదనే కారణంతోనే నవయుగ కంపెనీ పనుల నుంచి తప్పించినట్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మళ్ళీ కొత్తగా పిలవనున్న టెండర్ల ప్రక్రియలో
నవయుగ కంపెనీ తిరిగి పాల్గొన వచ్చని అధికారులు తెలియజేసారు.
[subscribe]
[youtube_video videoid=rGOWmbfoKxI]