నర్సపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ముందుగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరుస్తూ, ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై పలు సెక్క్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కాగా సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు హౌజ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శనివారం మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ కావాలంటే సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని కోర్టు సూచించింది. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు గుంటూరులోని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ