స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ తరపున రాష్ట్ర ప్రతినిధులు ఎవరూ హాజరుకాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఏపీకి ఆహ్వానం రాలేదని, ఇది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దీనిపై వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ప్రతిపక్షాల విమర్శలకు బదులిస్తూ.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం అందిందని స్ఫష్టం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి డబ్ల్యూఈఎఫ్ నుండి ప్రభుత్వానికి నవంబర్ 25వ తేదీనే అధికారిక ఆహ్వానం అందిందని ప్రభుత్వ సర్క్యూట్ హౌస్లో మీడియాకు ఆహ్వానం కాపీని చూపారు. అయితే మార్చిలో విశాఖ వేదికగా బిజినెస్ గ్లోబల్ సమ్మిట్ ఉన్నందున దావోస్ వెళ్లలేదని వివరించారు. కానీ దీనిపై టీడీపీ అధినేత సహా ఆ పార్టీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని, డబ్ల్యూఈఎఫ్కు ఆంధ్రప్రదేశ్ను ఆహ్వానించలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలాగే వారికి అనుకూలంగా ఉండే టీవీ ఛానళ్లు, వార్తాపత్రికల ద్వారా ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE