నేడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులతో పాటు ప్రజలు కూడా భారీగా హాజరయ్యారు. సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక అని పేరు పెట్టారు. జనసేన ఆవిర్భావ సభలో నాదెండ్ల ప్రారంభోపన్యాసం చేశారు. గత రెండు సంవత్సరాలలో కరోనా కారణంగా చనిపోయిన వారికి సభా వేదిక నుంచి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సంతాపం ప్రకటించారు. అలాగే, రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్టు మనోహర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఆవిర్భావ సభలో ముఖ్య అతిథిగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతిపక్ష పార్టీల అధినేతలకు, నాయకులకు నమస్కారం అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే, ప్రతి ఒక్కరికీ నమస్కరించటం మా పార్టీ సంస్కారం అని చెప్పారు. అలాగే, తెలంగాణ లోని పార్టీలకు, ఆయా పార్టీల ముఖ్య నేతలకు అభివందనం చేశారు. ఎనిమిదేళ్ల కిందట తమ ప్రస్థానం నెమ్మదిగా ఆరంభమయిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించటానికి ప్రాధాన్యతమిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలకు రాష్ట్ర ప్రజానీకం చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటగా మంచి కార్యక్రమంతో పాలన సాగిస్తారని.. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టారని, ఇది అశుభం అని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ పౌరుడి మీద లక్ష రూపాయల అప్పు ఉన్నదని పార్టీ సీనియర్ నేత నాగబాబు పేర్కొన్నారు. ఈ సభ కోసం ఇప్పటం రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారి పొలాల్ని ఇవ్వడం సంతోషకరమని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. రైతుల పట్టువదలని దీక్ష, న్యాయస్థానం అద్భుత తీర్పు, జనసైనికుల పోరాటం కారణంగా అమరావతి వచ్చిందని వెల్లడించారు. పవన్ కల్యాణ్ నాకు తోడపుట్టినా.. ఆయన నాకూ నాయకుడేనని చెప్పారు. ఏపీలో రాబోయేది జనసేన ప్రభుత్వమేనని.. పవన్ కల్యాణ్ సీఎం అవుతారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఆవిర్భావ సభలో ముఖ్య అతిథిగా జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ