జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని రణస్థలంలో నిర్వహించిన ‘యువశక్తి’ బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ వ్యాఖ్యలపై వైసీపీ పార్టీకి చెందిన మంత్రులు, పలువురు నేతలు పవన్ కళ్యాణ్పై అంతేస్థాయిలో ప్రతివిమర్శలు చేశారు. మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు జనసేనానిపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కు సీఎం జగన్ను విమర్శించే స్థాయి లేదని, ఆయన కేవలం సినిమా డైలాగ్స్ చెప్పటానికే పనికొస్తారని వ్యాఖ్యానించారు.
యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నేను సంబరాల రాంబాబు అయితే నువ్వు కల్యాణాల పవన్ వి. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే వారికి పదవుల పైనే వ్యామోహం – మంత్రి అంబటి రాంబాబు.
పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక విధానం కానీ, ఎజెండా కానీ లేవు. కాపులందరిపైనా ఆయనకు పేటెంట్ ఉన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. పవన తన పార్టీ జనసేనకు చంద్రసేన అని పేరు మార్చుకుంటే బెటర్ – మంత్రి గుడివాడ అమర్నాథ్.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారని, ఒక పార్టీకి నాయకుడిగా ఉండి కూడా మరో పార్టీకి సాయమందించేందుకు పవన్ ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడు – మంత్రి సీదిరి అప్పలరాజు.
దేశంలో పవన్ ఒక్కడే బరితెగింపు రాజకీయం చేస్తున్నాడు. ఒకవైపు బీజేపీతో కలిసున్నానని చెబుతూ.. మరోవైపు టీడీపీతో పొత్తుకు తహతహలాడుతున్నాడు. చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ ప్రయత్నాలు. కాపులతో పాటు బీసీలను కూడా పవన్ మోసం చేస్తున్నాడు – మాజీ మంత్రి పేర్ని నాని.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE