ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 108 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన మూడు గ్రాడ్యుయేట్ (పట్టభద్రుల) ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం (టీడీపీ) ఆధిపత్యం చూపించింది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరుగగా.. రెండింటిని కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో విజయ బావుటా ఎగరేసింది. ఈ రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఇరువురు తొలి ప్రాధాన్య ఓట్లలో టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యం సాధించారు. ఉత్తరాంధ్ర టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ అభ్యర్థి శ్రీకాంత్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక మూడో స్థానమైన పశ్చిమ రాయలసీమలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉండటంతో.. ఇక్కడ రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకం కానున్నాయి. అయితే ఈ స్థానంలో కూడా విజయం సాధిస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫలితాలపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE