ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం గుంటూరులోని పరిక్షా భవన్లో స్టేట్ డైరెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్లో 60.40 శాతం, పదిలో 52.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. పదోతరగతిలో 32,040 మంది విద్యార్థులు హాజరు కాగా, 16,866 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. పదో తరగతిలో చిత్తూరు జిల్లాలో ఎక్కువుగా, అనంతపురం జిల్లాలో అతితక్కువుగా ఉత్తీర్ణత శాతం నమోదన్నారు.
ఇక ఇంటర్మీడియట్ పరీక్షలకు 49,238 మంది విద్యార్థులు హాజరు కాగా, 29,742 మంది ఉత్తీర్ణులు అయినట్లు తెలిపారు. ఇంటర్ లో నెల్లూరు జిల్లాలో ఎక్కువుగా, అనంతపురం జిల్లాలో అతితక్కువుగా ఉత్తీర్ణత శాతం నమోదన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు http://www.apopenschool.ap.gov.in, http://portal.apopenschool.org/APOSS/APOSSRESULTS.aspx వెబ్సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపారు. మరోవైపు జూన్ 27 నుంచి జూలై 7 వరకు రీ కౌంటింగ్కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF