నీతి ఆయోగ్ నూతన కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా మాజీ ఐఏఎస్ అధికారి పరమేశ్వరం అయ్యర్ శుక్రవారం నియమితులయ్యారు. నీతి ఆయోగ్ ప్రస్తుత సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుండగా ఆయన స్ధానంలో అయ్యర్ను కేబినెట్ నియామకాల కమిటీ నియమించింది. కాగా అయ్యర్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అయ్యర్ 2009లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ సెక్రటరీగా పనిచేసిన పరమేశ్వరన్ అయ్యర్ గతేడాది జూలైలో తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
అయ్యర్, ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన 1981-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయనకు అత్యుతమ పారిశుధ్య నిపుణుడుగా అధికార వర్గాలలో పేరుంది. 2016లో, దేశవ్యాప్త పారిశుద్ధ్య ప్రచారమైన స్వచ్ఛ్ భారత్ మిషన్ను అమలు చేయడానికి ఆయనను భారత ప్రభుత్వం నియమించింది. అతను 2016లో భారత ప్రభుత్వంలోని డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ మంత్రిత్వ శాఖలో చేరడానికి ముందు, అతను ప్రపంచ బ్యాంకు కోసం వియత్నాం, చైనా, ఈజిప్ట్, లెబనాన్ మరియు వాషింగ్టన్లలో పనిచేశారు. అయ్యర్ ఐక్యరాజ్యసమితిలో సీనియర్ గ్రామీణ నీటి శానిటేషన్ స్పెషలిస్ట్గా కూడా పనిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY