తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘టీఎస్ పాలిసెట్-2022’ నోటిఫికేషన్ ను గురువారం నాడు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి విడుదల చేసింది. జూన్ 30వ తేదీన పాలిసెట్-2022 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ రెండోవారం నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. కాగా రూ.100 ఆలస్య రుసుముతో జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు పాలిసెట్-2022 ఫలితాలను పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ