కేరళలో రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప భక్తుల వాహనం బోల్తా, పలువురికి తీవ్ర గాయాలు, ఘటనపై సీఎం జగన్ ఆరా

AP Sabarimala Devotees Injured in Bus Overturns Incident in Kerala Today CM Jagan Inquires,AP Sabarimala Devotees,CM Jagan Inquires,Bus Overturns Incident,Mango News,Mango News Telugu, Sabarimala Devotees Injured,Sabarimala Devotees,AP Sabarimala Devotees Injured,Sabarimala Bus Overturns,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

కేరళలో రోడ్డు శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో ఒక చిన్నారి సహా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా అయ్యప్ప స్వాములు మొత్తం 3 బస్సుల్లో ఈ నెల 15న ఏలూరు జిల్లా నుంచి కేరళకు వెళ్లారు. స్వామి దర్శనం ముగించుకుని శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పాథన్‌తిట్ట జిల్లా లాహాలాంప్ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 44మంది భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ఆయన అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యసహాయం అందేలా చూడాలని, కోలుకున్న వారిని తిరిగి రాష్ట్రం చేరుకోవడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కాగా క్షతగాత్రులను ఏలూరు జిల్లాలోని మేడేపల్లి ప్రాంతానికి చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కేరళలో ప్రమాదం జరిగిన స్థానిక కలెక్టర్ తో పాటు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =