ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం నాలుగో దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిదశలో ప్రకాశం, విజయనగరం జిల్లాల మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు.
ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించడమే ఎన్నికల కమిషన్ బాధ్యతని పేర్కొన్నారు. ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వస్తే పాటిస్తామని నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పక్రియ ఈ రోజుతో ప్రారంభమై ఫిబ్రవరి 5న పోలింగ్, ఓట్ల లెక్కింపు, సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగియనుందని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 5 న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు పేర్కొన్నారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల ఫేజ్-1 నోటిఫికేషన్ వివరాలు:
- నామినేషన్ల స్వీకరణ: జనవరి 25
- నామినేషన్ చివరి రోజు: జనవరి 27
- నామినేషన్ల పరిశీలన: జనవరి 28
- నామినేషన్ల వచ్చే అభ్యంతరాల పరిశీలన: జనవరి 28
- నామినేషన్ల వచ్చే అభ్యంతరాలపై తుది నిర్ణయం: జనవరి 30
- ఉపసంహరణ చివరి తేదీ: జనవరి 31
- ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 5
- ఓట్ల లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 5
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ