ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి సమీక్ష నిర్వహించారు. తోలి దశలో ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద నిర్ధేశించుకున్న పోలవరం, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వెలిగొండ, వంశధార, అవుకు టన్నెల్ తదితర ప్రాజెక్టుల పురోగతి, పనులు సాగుతున్న తీరుపై అధికారులతో చర్చించారు. పోలవరానికి సంబంధించి ప్రతి పనిలో ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సకాలంలో ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పారు. అలాగే రెండవ విడత ప్రాధాన్యత ప్రాజెక్టుల కార్యాచరణ సిద్ధం చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.
పోలవరానికి సంబంధించి ప్రతి పనిలో ప్రాధాన్యత నిర్ధారించుకుని ముందుకు సాగాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సకాలంలో ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. 2వ విడత ప్రాధాన్యత ప్రాజెక్టుల కార్యాచరణ సిద్ధం చేయాలని, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని అధికారులను కోరారు.(2/2)
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 29, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ