ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ సారా తాగి 42 మంది మరణించారని, దీనిపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు టీడీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. నల్ల కండువాలు వేసుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శించారు. ఈ 42 మరణాలపై సభలో చర్చ జరపాలని, దీనిపై మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వాలని నినాదాలతో హోరెతించారు. ప్రభుత్వం టీడీపీ నేతలు మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ, మద్యపాన నిషేధంపై ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అలాగే కల్తీ సారా తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కల్తీసారా మరణాలన్నింటిపై నిష్పక్షపాత విచారణ చేయాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ