ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఉపఎన్నిక అనివార్యం కాగా ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డికే అధికార వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చింది. బీజేపీ తరపున జి భరత్ కుమార్ బరిలో నిలిచారు. మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్యే ఉండనుంది. ఓటింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్తో పాటు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో వెబ్క్యాస్టింగ్ చేస్తున్నారు. దీనిని ఈసీ పర్యవేక్షించనుంది. మొత్తం 279 పోలింగ్ స్టేషన్లలో 2,13,388 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆ సమయానికి క్యూలో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన తల్లి మణి మంజరి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లెలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్చార్జి బాలినేని శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్ రెడ్డి నియోజక వర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని, ఆయనతో పాటు ఆయన కుటుంబానికి కూడా జిల్లాలో మంచి ఆదరాభిమానాలు ఉన్నాయని అన్నారు. ఆత్మకూరు వైఎస్సార్సీపీకి కంచుకోట. మేము అనేక సార్లు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశాము. మేము భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY