ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి గానూ వివిధ సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అలాగే మొత్తం 10 ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి కన్వీనర్లను కూడా నియమిస్తూ ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో పలు ప్రవేశ పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలు, కన్వీనర్ల వివరాలు:
- ఈఏపీ సెట్ – జేఎన్టీయూ, అనంతపురం – సీ.శోభా బిందు (కన్వీనర్)
- ఈసెట్ – జేఎన్టీయూ, కాకినాడ – ఏ.కృష్ణ మోహన్ (కన్వీనర్)
- పీజీ ఈసెట్ – శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి – ఆర్వీఎస్ సత్యనారాయణ (కన్వీనర్)
- ఐసెట్ – శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీ అనంతపురం – పీ.మురళీ కృష్ణ (కన్వీనర్)
- ఎడ్సెట్ – ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం – కె.రాజేంద్ర ప్రసాద్ (కన్వీనర్)
- లాసెట్ – ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు – బీ.హరి బాబు (కన్వీనర్)
- పీఈసెట్ – ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు – పీపీఎల్ పౌల్ కుమార్ (కన్వీనర్)
- పీజీసెట్ – ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం – ఎన్.రమణయ్య (కన్వీనర్)
- ఆర్ సెట్ – శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి – బీ.దేవప్రసాద్ రాజ్ (కన్వీనర్)
- ఏడీసెట్ – డాక్టర్ వైఎస్ఆర్ అర్చిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ కడప – ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి (కన్వీనర్).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE